LIVE: ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న సీఎం చంద్రబాబు - ప్రత్యక్షప్రసారం - AP Assembly Sessions 2024

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 26, 2024, 9:06 AM IST

Updated : Jul 26, 2024, 3:20 PM IST

thumbnail
AP Assembly Sessions 2024 Live: నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియనున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై నేడు ముఖ్యంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఐదేళ్ల జగన్​ పాలనలో ఆర్థికశాఖలో చోటు చేసుకున్న అనేక అవకతవకలు, అప్పులను లోతుల్లోకి వెళ్లి వెలికి తీయాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై లోతుగా పరిశీలన చేసిన కూటమి ప్రభుత్వం మొత్తంగా రాష్ట్ర అప్పులు 10 లక్షల కోట్లు ఉంటాయని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆదాయం, అప్పులు వంటి వివరాలను ప్రజల ముందుంచేందుకు చంద్రబాబు రెడీ అయ్యారు. ఇప్పటికే పలు అంశాలపై శ్వేతపత్రాలను విడుదల చేసిన ఆయన వాటి వివరాలను ప్రజల ముందుంచారు. దీంతోపాటు టిడ్కో గృహాల స్థితిగతులపై నేడు అసెంబ్లీలో చర్చించనున్నారు. ఈ నెలాఖరుతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ ముగియనున్నందున కొత్త బడ్జెట్‌ ప్రవేశపెట్టాల్సి ఉన్నా ప్రస్తుత సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టే ఆలోచనలో ప్రభుత్వం లేదు. ఈ నేపథ్యంలో ఐదోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రత్యక్షప్రసారం మీకోసం. 
Last Updated : Jul 26, 2024, 3:20 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.