thumbnail

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 10, 2024, 8:46 PM IST

Updated : Apr 10, 2024, 9:53 PM IST

ETV Bharat / Videos

LIVE: నిడదవోలులో కూటమి ఉమ్మడి సభ - ప్రత్యక్షప్రసారం - Alliance Meeting at Nidadavolu

TDP Janasena,BJP Public Meeting In Nidadavolu LIVE : ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. జగన్‌ను ఓడించడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే జనసేన,టీడీపీ,బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయి. ఇందులో భాగంగా ప్రజాగళం పేరుతో చంద్రబాబు సభలు నిర్వహిస్తున్నారు. అలాగే వారాహి విజయ భేరి సభలతో ఇటు పవన్‌ కల్యాణ్‌ ప్రచారాన్ని ముమ్మారం చేశారు. మరో వైపు బీజేపీ సైతం ప్రజల్లో విస్త్రతంగా పర్యటిస్తుంది. తాజాగా ప్రజలను చైతన్య పరిచేందుకు కూటమి నేతలందరూ కలిసి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జరిగే తణుకు, నిడదవోలు సభలలో పాల్కొంటున్నారు. ఈరోజు తణుకు, నిడదవోలులో జరిగిన సభలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నేతలు సభలలో పాల్కొన్నారు. సాయంత్రం 4 గంటలకు తణుకులో  సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజాగళం సభలో పాల్గొన్నారు. తణుకు పర్యటన ముగిసి రాత్రి 7 గంటలకు నిడదవోలులో మరో సభను ఏర్పాటు చేశారు. ఇందులో కూడా కూటమి నేతలు పాల్కొన్నారు. అదేవిధంగా రేపు అంబాజీపేట, అమలాపురంలో జరిగే సభలలో సైతం కూటని నేతలు ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తారు. ప్రస్తుతం నిడదవోలులో కూటమి ఉమ్మడి సభ ప్రత్యక్షప్రసారం మీ కోసం.
Last Updated : Apr 10, 2024, 9:53 PM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.