ETV Bharat / state

భీమిలీ బీచ్​ వద్ద యథేచ్ఛగా వైఎస్సార్​సీపీ నేతల భూకబ్జాలు - స్పందించని అధికారులు - YSRCP Leaders Illegal constructions

YSRCP Leaders Illegal constructions in Bhimili Beach: జగన్ అండతో తమ పార్టీ నేతలు కొండలు, గుట్టలు, వాగులతో పాటు గెడ్డలను సైతం ఆక్రమించుకుని భూ దాహాన్ని తీర్చుకుంటున్నారు. విశాఖ జిల్లా భీమిలీ బీచ్‌లో శిథిలమైన ఆల్ఫా పరిశ్రమ సమీపంలో సముద్రం పక్కన నిర్మాణాలు చేపట్టారు. దీనిపై మీడియా పలు కథనాలు ప్రచురించడంతో జీవీఎంసీ, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌ అధికారులు పరిశీలించారు. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి వెనక్కి తగ్గారు.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 31, 2024, 10:20 PM IST

ysrcp_leaders_illegal_constructions
ysrcp_leaders_illegal_constructions (ETV Bharat)
భీమిలీ బీచ్​ వద్ద యధేచ్చగా వైఎస్సార్​సీపీ నేతల భూకబ్జాలు - స్పందించని అధకారులు (ETV Bharat)

YSRCP Leaders Illegal constructions in Bhimili Beach: వైఎస్సార్​సీపీ హయాంలో కొండలు, గుట్టలు, వాగులతో పాటు గెడ్డలను సైతం ఆక్రమించుకుని బడా నాయకులు భూ దాహాన్ని తీర్చుకుంటున్నారు. అధికారులు మాత్రం తమ బాధ్యతలను ఒకరిపై ఒకరు నెట్టుకొస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టి ఒకాల్తా పలుకుతున్నారు. విశాఖ జిల్లా భీమిలీ బీచ్‌లో శిథిలమైన ఆల్ఫా పరిశ్రమ సమీపంలో సముద్రం పక్కన నిర్మాణాలు చేపట్టారు. దీనిపై మీడియా పలు కథనాలు ప్రచురించడంతో జీవీఎంసీ, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌ అధికారులు పరిశీలించారు. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి వెనక్కి తగ్గారు.

విజయవాడలో విజృంభిస్తున్న డయేరియా- ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య - Diarrhea Death Cases in Vijayawada

ఈ నేపథ్యంలో ఇదే ప్రాంతంలో గత వారం రోజులుగా కల్వర్టును ఆనుకొని టీఎస్ నెంబర్ 1522లో సుమారు ఎకరా గెడ్డ స్థలాన్ని పట్టపగలే జేసీబీతో చదును చేశారు. అక్కడతో ఆగకుండా ఫెన్సింగ్ ఫోల్స్ సైతం వేశారు. కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు కనీసం కన్నెత్తి చూసే సాహసం చేయకపోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. పేదోడు గజం స్థలం ఆక్రమించుకుంటే (GVMC), రెవెన్యూ, పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులు పోలీస్ బందోబస్తుతో ఆక్రమణలు కూల్చివేయడం, ఆక్రమణదారులపై విరుచుకుపడతారు. అటువంటిది నిబంధనలను తుంగలో తొక్కి సముద్రంలోకి చొచ్చుకుపోతున్నా, గడ్డ వాగు స్థలాన్ని కబ్జా చేస్తున్నా పట్టించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని సామగ్రి తరలింపును అడ్డుకున్న సీఆర్డీఏ - గుత్తేదారు సంస్థకు నోటీసులు - CRDA Blocked Material Moving

తప్పించుకుంటున్న అధికారులు: ఈ విషయమై భీమునిపట్నం జోనల్ కమిషనర్ కే. కనకమహాలక్ష్మి కలవగా ఇంజనీరింగ్ అధికారులను సంప్రదించాలంటూ తప్పించుకున్నారు. ఇంజనీరింగ్ అధికారులకు ఫోన్లో వివరణ కోరగా కబ్జా మా పరిధిలోకి రాదని పట్టణ ప్రణాళికా విభాగాన్ని సంప్రదించాలని సుతిమెత్తగా తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ విభాగ అసిస్టెంట్ సిటీ ప్లానర్​కు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో మరోసారి జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మిని అడగగా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ వాళ్లు చూడాల్సిందన్నారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీనీ ఫోన్లో కాన్ఫరెన్స్ కలుపుతానంటూ సమాధానం దాటవేశారు.

గదిలో వేరే మహిళతో- భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న 'మిస్ వైజాగ్' నక్షత్ర - MISS VIZAG NAKSHTRA

భీమిలీ బీచ్​ వద్ద యధేచ్చగా వైఎస్సార్​సీపీ నేతల భూకబ్జాలు - స్పందించని అధకారులు (ETV Bharat)

YSRCP Leaders Illegal constructions in Bhimili Beach: వైఎస్సార్​సీపీ హయాంలో కొండలు, గుట్టలు, వాగులతో పాటు గెడ్డలను సైతం ఆక్రమించుకుని బడా నాయకులు భూ దాహాన్ని తీర్చుకుంటున్నారు. అధికారులు మాత్రం తమ బాధ్యతలను ఒకరిపై ఒకరు నెట్టుకొస్తూ కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములను అధికార పార్టీ నేతలకు కట్టబెట్టి ఒకాల్తా పలుకుతున్నారు. విశాఖ జిల్లా భీమిలీ బీచ్‌లో శిథిలమైన ఆల్ఫా పరిశ్రమ సమీపంలో సముద్రం పక్కన నిర్మాణాలు చేపట్టారు. దీనిపై మీడియా పలు కథనాలు ప్రచురించడంతో జీవీఎంసీ, రెవెన్యూ, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్‌ అధికారులు పరిశీలించారు. కానీ ప్రభుత్వ పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గి వెనక్కి తగ్గారు.

విజయవాడలో విజృంభిస్తున్న డయేరియా- ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య - Diarrhea Death Cases in Vijayawada

ఈ నేపథ్యంలో ఇదే ప్రాంతంలో గత వారం రోజులుగా కల్వర్టును ఆనుకొని టీఎస్ నెంబర్ 1522లో సుమారు ఎకరా గెడ్డ స్థలాన్ని పట్టపగలే జేసీబీతో చదును చేశారు. అక్కడతో ఆగకుండా ఫెన్సింగ్ ఫోల్స్ సైతం వేశారు. కోట్ల రూపాయల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నా సంబంధిత అధికారులు ఆ వైపు కనీసం కన్నెత్తి చూసే సాహసం చేయకపోవడంపై పలు విమర్శలకు తావిస్తోంది. పేదోడు గజం స్థలం ఆక్రమించుకుంటే (GVMC), రెవెన్యూ, పట్టణ ప్రణాళిక ఇంజనీరింగ్ అధికారులు పోలీస్ బందోబస్తుతో ఆక్రమణలు కూల్చివేయడం, ఆక్రమణదారులపై విరుచుకుపడతారు. అటువంటిది నిబంధనలను తుంగలో తొక్కి సముద్రంలోకి చొచ్చుకుపోతున్నా, గడ్డ వాగు స్థలాన్ని కబ్జా చేస్తున్నా పట్టించకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజధాని సామగ్రి తరలింపును అడ్డుకున్న సీఆర్డీఏ - గుత్తేదారు సంస్థకు నోటీసులు - CRDA Blocked Material Moving

తప్పించుకుంటున్న అధికారులు: ఈ విషయమై భీమునిపట్నం జోనల్ కమిషనర్ కే. కనకమహాలక్ష్మి కలవగా ఇంజనీరింగ్ అధికారులను సంప్రదించాలంటూ తప్పించుకున్నారు. ఇంజనీరింగ్ అధికారులకు ఫోన్లో వివరణ కోరగా కబ్జా మా పరిధిలోకి రాదని పట్టణ ప్రణాళికా విభాగాన్ని సంప్రదించాలని సుతిమెత్తగా తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో పట్టణ విభాగ అసిస్టెంట్ సిటీ ప్లానర్​కు పలుమార్లు ఫోన్ చేసినప్పటికీ స్పందించకపోవడంతో మరోసారి జోనల్ కమిషనర్ కనకమహాలక్ష్మిని అడగగా ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ వాళ్లు చూడాల్సిందన్నారు. టౌన్ ప్లానింగ్ ఏసీపీనీ ఫోన్లో కాన్ఫరెన్స్ కలుపుతానంటూ సమాధానం దాటవేశారు.

గదిలో వేరే మహిళతో- భర్తను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న 'మిస్ వైజాగ్' నక్షత్ర - MISS VIZAG NAKSHTRA

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.