ETV Bharat / state

ఇష్టారీతిన పెంచేస్తున్నారు!- బియ్యం ధరలు వింటేనే భయపడుతున్న ప్రజలు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 28, 2024, 8:05 AM IST

Rice Rates Heavy in AP: రాష్ట్రంలో బియ్యం ధరలను వ్యాపారులు ఇష్టారీతిన పెంచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గడిచిన ఆరు నెలల కాలంలోనే 26 కేజీల బస్తాకు దాదాపు 400 రూపాయల వరకు పెరిగింది. ధరలకు కళ్లెం వేయకుండా అధికారులు చోద్యం చూస్తున్నారు. బియ్యం ధరలు చూసి సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.

rice_rates_heavy_in_ap
rice_rates_heavy_in_ap
ఇష్టారీతిన పెంచేస్తున్నారు!- బియ్యం ధరలు వింటేనే భయపడుతున్న ప్రజలు

Rice Rates Heavy in AP: బియ్యం ధరలు వింటేనే భయం వేస్తోంది. భవిష్యత్తులో బియ్యం కొనగలమా అనే సందేహం సామాన్యుల్ని వెంటాడుతోంది. ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నా నియంత్రించే నాథుడే రాష్ట్రంలో కరవయ్యాడు. ధరలకు కళ్లెం వేయాల్సిన సర్కారు కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. వర్షాల్లేక ఈ ఏడాది వరి సాగు తగ్గడం మరింత కలవరానికి గురి చేస్తోంది. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి తమ బాధలు చూడాలని సామాన్యులు వేడుకుంటున్నారు.

ఆరు నెలల్లోనే అమాంతం: రాష్ట్రంలో గడిచిన నెల వ్యవధిలో బియ్యం ధరలు (Rice Price) భారీగా పెరిగాయి. మధ్య తరగతి, ఆపై వర్గాల వారు సన్న బియ్యం తినడానికి మొగ్గు చూపుతున్నారు. వెరైటీని బట్టి 26 కేజీల బస్తా 14 వందల రూపాయల నుంచి 17వందల రూపాయల వరకు ఉంది. ఆరు నెలల్లోనే బియ్యం ధరలు (25kg rice price in andhra pradesh) పెద్దఎత్తున పెరిగిపోయాయి.

వైఎస్సార్సీపీ హయాంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి : దేవినేని ఉమా

ధరలను నియంత్రించని అధికారులు : ప్రభుత్వం నుంచి లైసెన్సు పొంది, జీఎస్టీ పరిధిలో ఉన్న హోల్‌సేల్‌ డీలర్లు, ట్రేడర్లు బియ్యం ధరలను విచ్చలవిడిగా పెంచుతున్నా పౌర సరఫరాల అధికారులు నియంత్రించలేకపోతున్నారు. సన్నరకం, హెచ్ఎంటీ, సూపర్ ఫైన్ రకాల ధరలను అమాంతం పెంచేస్తున్నారు.

రేషన్​ బియ్యం అనువుగా లేవని సన్నబియ్యానికే మొగ్గు​ : ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం తినడానికి అనువుగా లేక చాలా మంది బహిరంగ మార్కెట్లోకి అమ్మేస్తున్నారు. ఉచిత బియ్యాన్ని కేజీ 15 రూపాయల నుంచి 18 రూపాయలకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వీరంతా సన్నబియ్యం వైపే మొగ్గుచూడం వల్ల మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడుతోంది.

'ఏపీలో తప్ప ఏ రాష్ట్రంలోనూ ఇలా ధరలు పెరగలేదు..'

"బియ్యం ధరలు అసాధారణంగా 30 రూపాయలవి 60 రూపాయలకు పెరిగిపోయాయి. ప్రభుత్వాలు కూడా పట్టించుకోకుండా నిమ్మకు నిరేత్తినట్లు ఉన్నాయి. దీనివల్ల కేవలం మిల్లర్లకు మాత్రమే లాభం జరుగుతోంది." - వినియోగదారుడు

"25కేజీల బియ్యం బస్తా గతంలో 1050 రూపాయలు ఉండేది. ఇప్పుడు 1600 రూపాయలు అయ్యింది. ధరలు బాగా ఎక్కువయ్యాయి." - వినియోగదారుడు

సన్నలకే డిమాండ్​ : ప్రజలందరూ సన్నబియ్యానికి మొగ్గు చూపుతుండటంతో డిమాండ్​ పెరిగుతోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న వ్యాపారులు బియ్యం ధరలను అమంతం పెంచుతున్నారు. పెరిగిన ధరలను చూసి వినియోగదారులు బెంబెలెత్తుతున్నారు.

ధరలు మరింత పెరిగే అవకాశం : ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ధాన్యం దిగుబడి భారీగా తగ్గిపోయింది. భవిష్యత్తులో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే కథనాలు సామాన్యుల్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మార్కెట్‌లో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.

ఆక్వా ఉత్పత్తులకు ఏపీలోనే ఎక్కువ ధరలు: సాధికారిక కమిటీ

ఇష్టారీతిన పెంచేస్తున్నారు!- బియ్యం ధరలు వింటేనే భయపడుతున్న ప్రజలు

Rice Rates Heavy in AP: బియ్యం ధరలు వింటేనే భయం వేస్తోంది. భవిష్యత్తులో బియ్యం కొనగలమా అనే సందేహం సామాన్యుల్ని వెంటాడుతోంది. ఇష్టారీతిన ధరలు పెంచేస్తున్నా నియంత్రించే నాథుడే రాష్ట్రంలో కరవయ్యాడు. ధరలకు కళ్లెం వేయాల్సిన సర్కారు కళ్లప్పగించి చోద్యం చూస్తోంది. వర్షాల్లేక ఈ ఏడాది వరి సాగు తగ్గడం మరింత కలవరానికి గురి చేస్తోంది. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి తమ బాధలు చూడాలని సామాన్యులు వేడుకుంటున్నారు.

ఆరు నెలల్లోనే అమాంతం: రాష్ట్రంలో గడిచిన నెల వ్యవధిలో బియ్యం ధరలు (Rice Price) భారీగా పెరిగాయి. మధ్య తరగతి, ఆపై వర్గాల వారు సన్న బియ్యం తినడానికి మొగ్గు చూపుతున్నారు. వెరైటీని బట్టి 26 కేజీల బస్తా 14 వందల రూపాయల నుంచి 17వందల రూపాయల వరకు ఉంది. ఆరు నెలల్లోనే బియ్యం ధరలు (25kg rice price in andhra pradesh) పెద్దఎత్తున పెరిగిపోయాయి.

వైఎస్సార్సీపీ హయాంలో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటాయి : దేవినేని ఉమా

ధరలను నియంత్రించని అధికారులు : ప్రభుత్వం నుంచి లైసెన్సు పొంది, జీఎస్టీ పరిధిలో ఉన్న హోల్‌సేల్‌ డీలర్లు, ట్రేడర్లు బియ్యం ధరలను విచ్చలవిడిగా పెంచుతున్నా పౌర సరఫరాల అధికారులు నియంత్రించలేకపోతున్నారు. సన్నరకం, హెచ్ఎంటీ, సూపర్ ఫైన్ రకాల ధరలను అమాంతం పెంచేస్తున్నారు.

రేషన్​ బియ్యం అనువుగా లేవని సన్నబియ్యానికే మొగ్గు​ : ప్రభుత్వం రేషన్‌ షాపుల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం తినడానికి అనువుగా లేక చాలా మంది బహిరంగ మార్కెట్లోకి అమ్మేస్తున్నారు. ఉచిత బియ్యాన్ని కేజీ 15 రూపాయల నుంచి 18 రూపాయలకు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వీరంతా సన్నబియ్యం వైపే మొగ్గుచూడం వల్ల మార్కెట్‌లో డిమాండ్ ఏర్పడుతోంది.

'ఏపీలో తప్ప ఏ రాష్ట్రంలోనూ ఇలా ధరలు పెరగలేదు..'

"బియ్యం ధరలు అసాధారణంగా 30 రూపాయలవి 60 రూపాయలకు పెరిగిపోయాయి. ప్రభుత్వాలు కూడా పట్టించుకోకుండా నిమ్మకు నిరేత్తినట్లు ఉన్నాయి. దీనివల్ల కేవలం మిల్లర్లకు మాత్రమే లాభం జరుగుతోంది." - వినియోగదారుడు

"25కేజీల బియ్యం బస్తా గతంలో 1050 రూపాయలు ఉండేది. ఇప్పుడు 1600 రూపాయలు అయ్యింది. ధరలు బాగా ఎక్కువయ్యాయి." - వినియోగదారుడు

సన్నలకే డిమాండ్​ : ప్రజలందరూ సన్నబియ్యానికి మొగ్గు చూపుతుండటంతో డిమాండ్​ పెరిగుతోంది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్న వ్యాపారులు బియ్యం ధరలను అమంతం పెంచుతున్నారు. పెరిగిన ధరలను చూసి వినియోగదారులు బెంబెలెత్తుతున్నారు.

ధరలు మరింత పెరిగే అవకాశం : ఈ ఏడాది రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల కారణంగా ధాన్యం దిగుబడి భారీగా తగ్గిపోయింది. భవిష్యత్తులో బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే కథనాలు సామాన్యుల్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. మార్కెట్‌లో బియ్యం ధరలు ఆకాశాన్ని అంటుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు.

ఆక్వా ఉత్పత్తులకు ఏపీలోనే ఎక్కువ ధరలు: సాధికారిక కమిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.