Misbehavior on Woman at Scanning Center in Visakha: విశాఖ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. స్కానింగ్ కోసం వచ్చిన ఓ మహిళను సిబ్బంది వేధింపులకు గురి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖకు చెందిన ఓ మహిళ తలకు గాయమై సోమవారం రాత్రి ఆసుపత్రికి వెళ్లింది. స్కానింగ్ చేయించాలని వైద్యులు చెప్పడంతో అదే ఆసుపత్రిలోని స్కానింగ్ సెంటర్కు వెళ్లింది. ఇదే అదునుగా భావించిన స్కానింగ్ సెంటర్ ఇన్ఛార్జి ప్రకాశ్ దురుద్దేశంతో స్కానింగ్ కోసం దుస్తులు తీసేయాలని ఆమెకు చెప్పాడు.
ఆ తర్వాత ఆమెతో అతను అసభ్యంగా ప్రవర్తించాడు. మహిళ కేకలు వేయడంతో అక్కడే ఉన్న స్థానికులు స్పందించి ప్రకాశ్కు దేహశుద్ధి చేశారు. ఈ మేరకు సమాచారం అందుకున్న విశాఖ 3వ పట్టణ సీఐ రమణయ్య హాస్పటల్కు చేరుకుని ప్రకాశ్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించినట్టు సీఐ తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యంతో రోగులు నరకం చూస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. కాగా ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
భార్య ఫొటోలు మార్ఫింగ్ చేసి బంధువులకు! - యువకుడి ప్రాణం తీసిన 2 వేలు
సీఎం చంద్రబాబు ఆగ్రహం: విశాఖ నగరంలోని ఓ హాస్పిటల్లో స్కానింగ్ కోసం వచ్చిన మహిళపై అక్కడి సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తలకు గాయం తగిలిన మహిళపై అసభ్యంగా ప్రవర్తించడం బాధాకరమన్నారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా అసభ్యంగా ప్రవర్తించిన స్కానింగ్ సెంటర్ సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.
రంగంలోకి పోలీసులు: చంద్రబాబు ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన 3వ టౌన్ పోలీసులు సదరు స్కానింగ్ సెంటర్ ఇన్ ఛార్జ్ ప్రకాష్ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పీఎన్సీ 74, 76 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతడికి రిమాండ్ విధించగా విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.