ETV Bharat / state

నంద్యాల జిల్లాలో దారుణం - చిన్నారిపై ముగ్గురు మైనర్ల అత్యాచారం - ఆపై కాల్వలోకి తోసి - RAPE ON GIRL IN NANDHYAL DISTRICT

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 10, 2024, 12:38 PM IST

Rape on Girl in Nandhyal District: నంద్యాల జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఎనిమిదేళ్ల వయసున్న బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం విచక్షణారహితంగా కాల్వలోకి తోసేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Rape_on_Girl_in_Nandhyala_District
Rape_on_Girl_in_Nandhyala_District (ETV Bharat)

Rape on Girl in Nandhyal District: ముక్కుపచ్చలారని పసికందుపై ముగ్గురు మైనర్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆడుతూ పాడుతూ స్నేహితులతో కలిసి స్కూల్​కు వెళ్లాల్సిన ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆ మృగాలు ఈ విషయం అందరికీ తెలిసిపోతుందని ఆ పసిపాపను సమీపంలోని కాల్వలో పడేశారు. ఈ అమానవీయ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: పగిడ్యాల మండలానికి చెందిన ఓ బాలిక మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె తండ్రి సమీప పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు నిజం బయటకొచ్చింది.

పార్క్​ వద్ద ఆడుకుంటున్న బాలికను సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లామని, అనంతరం అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ విషయం బయటపడుతుందనే భయంతో బాలికను కాల్వలోకి తోసేశామని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Rape on Girl in Nandhyal District: ముక్కుపచ్చలారని పసికందుపై ముగ్గురు మైనర్లు అత్యాచారానికి ఒడిగట్టారు. ఆడుతూ పాడుతూ స్నేహితులతో కలిసి స్కూల్​కు వెళ్లాల్సిన ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ఆ మృగాలు ఈ విషయం అందరికీ తెలిసిపోతుందని ఆ పసిపాపను సమీపంలోని కాల్వలో పడేశారు. ఈ అమానవీయ ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం: పగిడ్యాల మండలానికి చెందిన ఓ బాలిక మూడు రోజుల క్రితం అదృశ్యమైంది. ఆమె తండ్రి సమీప పోలీస్ స్టేషన్​కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా అసలు నిజం బయటకొచ్చింది.

పార్క్​ వద్ద ఆడుకుంటున్న బాలికను సమీపంలోని ఎత్తిపోతల పథకం వద్దకు తీసుకెళ్లామని, అనంతరం అత్యాచారం చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ విషయం బయటపడుతుందనే భయంతో బాలికను కాల్వలోకి తోసేశామని తెలిపారు. ప్రస్తుతం పోలీసులు బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.