ETV Bharat / state

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా మంత్రి లోకేశ్‌ అమెరికా పర్యటన - పారిశ్రామిక వేత్తలతో రౌండ్​టేబుల్ సమావేశం

రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా అమెరికాలో లోకేశ్ పర్యటన

Nara Lokesh America Tour
Nara Lokesh America Tour (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : 15 hours ago

Updated : 14 hours ago

Nara Lokesh Visit America Updates : ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పర్యటన సాగుతోంది. ఈ క్రమంలోనే శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్​రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని లోకేశ్ తెలిపారు. యువతకు రాబోయే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఆరు పాలసీలను ప్రకటించారని చెప్పారు.

ప్రవాసాంధ్రుల నుంచి పెద్దఎత్తున పెట్టుబడుల కోసం చంద్రబాబు ఎదురుచూస్తున్నారని లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్​గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని లోకేశ్​ వెల్లడించారు.

Lokesh Said AP as Investment Destination : కృష్ణా, గుంటూరు క్యాపిటల్ రీజియన్​లో 5 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని లోకేశ్​ వివరించారు. డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ డేటా సెంటర్ రానున్నట్లు తెలిపారు. త్వరలో టీసీఎస్​ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.

భారత్​లో డాటా రివల్యూషన్ రానున్నట్లు ఎలక్ట్రానిక్స్ రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నట్లు లోకేశ్​ వెల్లడించారు. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్​కి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని లోకేశ్​ విజ్ఞప్తి చేశారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్​ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్​రెడ్డి తెలిపారు. అందులో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు శ్రీకర్​రెడ్డి వివరించారు.

Lokesh Meet Industrialists in San Francisco : ఈ క్రమంలోనే అమెరికా శాన్​ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత డాటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డాటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని మంత్రి లోకేశ్​ సందర్శించారు. ఈ సందర్భంగా తమ కంపెనీ అందిస్తున్న డాటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండీ కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 260కి పైగా ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్చేంజి డాటాసెంటర్ల నెట్​వర్క్ కలిగి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లో డాటా సెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను లోకేశ్​కు వారు తెలియజేశారు.

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలతో పాటు మెరుగైన ప్రోత్సాహకాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని లోకేశ్ వారికి తెలిపారు. భారత్​లో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఆంధ్రప్రదేశ్​లో డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని వారిని ఆహ్వానించారు. ఈక్వెనెక్స్ ముందుకు వస్తే తాము అన్నివిధాలా సహాయ, సహకారాలు అందజేస్తామని లోకేశ్​ చెప్పారు.

రెండో రోజు లోకేశ్​ పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. గూగుల్ సీటీఓ ప్రభాకర్ రాఘవన్, జనరల్ అటమిక్స్ సిఇఓ డాక్టర్ వివేక్ లాల్, నియోట్రైబ్ వెంచర్స్ ఫౌండర్ కిట్టూ కొల్లూరి, జనరల్ కేటలిస్ట్స్ ఎండి నీరజ్ అరోరా, ఐ స్పేస్ ప్రెసిడెంట్ రాజేశ్ కొత్తపల్లి, సీఎఫ్ఓ ప్రసాద్ పాపుదేసి, గూగుల్ మాజీ అధికారి సారిన్ సువర్ణ, స్మియోటా కంపెనీ ప్రతినిధులతో లోకేశ్ వన్ టు వన్ భేటీ అయ్యారు. ఏపీలో కొత్తగా తెచ్చిన పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలను మంత్రి వారికి వివరించారు. అంతకుముందు శాన్​ఫ్రాన్సిస్కోలోని తాను​ బసచేసిన హోటల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో లోకేశ్​ సమావేశమయ్యారు. సుమారు 200 మంది కార్యకర్తలు భేటీ అయ్యి వారితో ఫొటోలు దిగారు.

ఏపీలో పెట్టుబడులకు దక్షిణ కొరియా సంస్థల ఆసక్తి - మంత్రి లోకేశ్​తో భేటీ

లోకేశ్ దిల్లీ టూర్ అప్డేట్స్ - 'ఇతర రాష్ట్రాలతో కాదు- దేశాలతోనే మాకు పోటీ'

Nara Lokesh Visit America Updates : ఏపీకి పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ పర్యటన సాగుతోంది. ఈ క్రమంలోనే శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్​రెడ్డి ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. అభివృద్ధి వికేంద్రీకరణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్​లో తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని లోకేశ్ తెలిపారు. యువతకు రాబోయే ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పించాలన్న లక్ష్యానికి అనుగుణంగా సీఎం చంద్రబాబు ఆరు పాలసీలను ప్రకటించారని చెప్పారు.

ప్రవాసాంధ్రుల నుంచి పెద్దఎత్తున పెట్టుబడుల కోసం చంద్రబాబు ఎదురుచూస్తున్నారని లోకేశ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం పెట్టుబడులు పెట్టేందుకు అనువైన వాతావరణం నెలకొని ఉందని చెప్పారు. కర్నూలు జిల్లాను డ్రోన్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి సంకల్పించారని పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాలను ఎలక్ట్రానిక్స్ హబ్​గా తయారు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ప్రకాశం జిల్లాలో బయో ఫ్యూయల్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తున్నామని లోకేశ్​ వెల్లడించారు.

Lokesh Said AP as Investment Destination : కృష్ణా, గుంటూరు క్యాపిటల్ రీజియన్​లో 5 బిలియన్ డాలర్ల విలువైన అభివృద్ధి పనులు చేపడుతున్నామని లోకేశ్​ వివరించారు. డిసెంబర్ నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. ఆర్థిక రాజధానిగా ఉన్న విశాఖపట్నంలో సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీ డేటా సెంటర్ రానున్నట్లు తెలిపారు. త్వరలో టీసీఎస్​ సంస్థ తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు.

భారత్​లో డాటా రివల్యూషన్ రానున్నట్లు ఎలక్ట్రానిక్స్ రంగంలో 300 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నట్లు లోకేశ్​ వెల్లడించారు. అమెరికాలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్​కి వచ్చి రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని లోకేశ్​ విజ్ఞప్తి చేశారు. ఏపీకి పెట్టుబడులు ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్​ అనేక ప్రయత్నాలు చేస్తున్నారని భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్​రెడ్డి తెలిపారు. అందులో భాగస్వామ్యం కావాలన్న ఉద్దేశంతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు శ్రీకర్​రెడ్డి వివరించారు.

Lokesh Meet Industrialists in San Francisco : ఈ క్రమంలోనే అమెరికా శాన్​ఫ్రాన్సిస్కోలోని ప్రఖ్యాత డాటా సేవల సంస్థ ఈక్వెనెక్స్ డాటా సెంటర్ కేంద్ర కార్యాలయాన్ని మంత్రి లోకేశ్​ సందర్శించారు. ఈ సందర్భంగా తమ కంపెనీ అందిస్తున్న డాటా సేవలు, కార్యకలాపాలను సంస్థ గ్లోబల్ ఎండీ కౌషిక్ జోషి, సీనియర్ స్ట్రాటజిక్ సేల్స్ ఇంజనీర్ రాబర్ట్ ఎలెన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 260కి పైగా ఇంటర్నేషనల్ బిజినెస్ ఎక్స్చేంజి డాటాసెంటర్ల నెట్​వర్క్ కలిగి ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్​లో డాటా సెంటర్ ఏర్పాటుకు గల అనుకూలతలను లోకేశ్​కు వారు తెలియజేశారు.

ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఎలక్ట్రానిక్స్ పాలసీలో పవర్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు వంటి రాయితీలతో పాటు మెరుగైన ప్రోత్సాహకాలు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని లోకేశ్ వారికి తెలిపారు. భారత్​లో పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన వాతావరణం నెలకొన్న ఆంధ్రప్రదేశ్​లో డాటా సెంటర్ ఏర్పాటు చేయాలని వారిని ఆహ్వానించారు. ఈక్వెనెక్స్ ముందుకు వస్తే తాము అన్నివిధాలా సహాయ, సహకారాలు అందజేస్తామని లోకేశ్​ చెప్పారు.

రెండో రోజు లోకేశ్​ పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. గూగుల్ సీటీఓ ప్రభాకర్ రాఘవన్, జనరల్ అటమిక్స్ సిఇఓ డాక్టర్ వివేక్ లాల్, నియోట్రైబ్ వెంచర్స్ ఫౌండర్ కిట్టూ కొల్లూరి, జనరల్ కేటలిస్ట్స్ ఎండి నీరజ్ అరోరా, ఐ స్పేస్ ప్రెసిడెంట్ రాజేశ్ కొత్తపల్లి, సీఎఫ్ఓ ప్రసాద్ పాపుదేసి, గూగుల్ మాజీ అధికారి సారిన్ సువర్ణ, స్మియోటా కంపెనీ ప్రతినిధులతో లోకేశ్ వన్ టు వన్ భేటీ అయ్యారు. ఏపీలో కొత్తగా తెచ్చిన పారిశ్రామిక పాలసీలు, ప్రోత్సాహకాలను మంత్రి వారికి వివరించారు. అంతకుముందు శాన్​ఫ్రాన్సిస్కోలోని తాను​ బసచేసిన హోటల్లో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో లోకేశ్​ సమావేశమయ్యారు. సుమారు 200 మంది కార్యకర్తలు భేటీ అయ్యి వారితో ఫొటోలు దిగారు.

ఏపీలో పెట్టుబడులకు దక్షిణ కొరియా సంస్థల ఆసక్తి - మంత్రి లోకేశ్​తో భేటీ

లోకేశ్ దిల్లీ టూర్ అప్డేట్స్ - 'ఇతర రాష్ట్రాలతో కాదు- దేశాలతోనే మాకు పోటీ'

Last Updated : 14 hours ago
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.