ETV Bharat / state

మదనపల్లె ఘటనపై సీఐడీ దూకుడు - సబ్‌ కలెక్టరేట్‌లో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ - CID Inquiry Madanapalle Incident

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 27, 2024, 9:54 AM IST

CID Inquiry Madanapalle Incident : మదనపల్లె సబ్‌ కలెక్టరేట్ దస్త్రాల దహనం కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మదనపల్లెలో మకాం వేసి వివరాలను సేకరించారు. తెల్లవారుజామున మూడు వరకు కార్యాలయంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు.

CID Inquiry Madanapalle Incident
CID Inquiry Madanapalle Incident (ETV Bharat)

Madanapalle Sub Collector Office Case Updates : మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గత నెల 21న జరిగిన దస్త్రాల దహనం కేసులో సీఐడీ దూకుడు పెంచింది. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం సోమవారం రాత్రి మదనపల్లెకి చేరుకుంది. అక్కడి నుంచి సబ్ కలెక్టరేట్​ కార్యాలయానికి చేరుకొని సోదాలు చేపట్టింది. ఇవాళ తెల్లవారుజామున 3 వరకు తనిఖీలు సాగాయి. ఈ క్రమంలోనే దస్త్రాల దహనం ఘటనకు సంబంధించి అధికారులు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

Madanapalle Files Burnt Case : పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్‌ తేజను సీఐడీ అధికారులు విచారించారు. ఘటన సమయంలో బీరువాల్లోని ఆయిల్ క్యాన్లపై ఆయనను ప్రశ్నించారు. మరోవైపు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, అదనపు ఎస్పీ రాజ్ కమల్, డీఎస్పీ వేణుగోపాల్ బృందం కూడా వారిని విచారించారు.

సీఐడీకి చిక్కిన కీలక ఆధారాలు : మరోవైపు వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు, దందాల బాధితులు ఫిర్యాదులపైనా అధికారులు చర్యలు చేపట్టారు. ఆధారాలతో నిర్దేశించిన సమయానికి కార్యాలయానికి రావాలని బాధితుల్ని సూచిస్తున్నారు. వారికి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ బృందాలు పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, శశికాంత్‌ నివాసాల్లో స్వాధీనం చేసుకున్న ఆధారాలను విశ్లేషిస్తున్నారు.

వివాదాస్పద భూముల లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతోపాటు ఐపాడ్, పెన్‌డ్రైవ్‌లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను క్షుణ్ణంగా సీఐడీ బృందాలు పరిశీలిస్తున్నారు. ఇందులో జగన్‌ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన వివరాలు ఉన్నట్లు సమాచారం. వాటిపైనా సీఐడీ అధికారులు కూపీ లాగుతున్నారు. లభించిన ఆధారాలు, సమాచారంతో పాటు మద్యంపై తమ వద్దనున్న ఫిర్యాదులతో సరిపోల్చుతూ దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిదంటే : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత నెల 21న అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే ప్రధాన కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. కార్యాలయ సిబ్బంది సమాచారం మేరకు ఫైర్ సిబ్హంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అయితే నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందు జరిగిన ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది అగ్నిప్రమాదమా?, కుట్ర పూరితమా? అనే కోణంలో విచారణను ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే.

మదనపల్లె అగ్నిప్రమాదం కేసు - ఎంఆర్‌ఐ డేటాలో వెలుగులోకి కీలక విషయాలు - Madanapalle Fire Accident Case

మదనపల్లె కేసులో కీలక పరిణామాలు-పెద్దిరెడ్డి పీఏ ఇంట్లో పలు ఫైల్స్ స్వాధీనం - MADANAPALLE FIRE ACCIDENT CASE

Madanapalle Sub Collector Office Case Updates : మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో గత నెల 21న జరిగిన దస్త్రాల దహనం కేసులో సీఐడీ దూకుడు పెంచింది. సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని బృందం సోమవారం రాత్రి మదనపల్లెకి చేరుకుంది. అక్కడి నుంచి సబ్ కలెక్టరేట్​ కార్యాలయానికి చేరుకొని సోదాలు చేపట్టింది. ఇవాళ తెల్లవారుజామున 3 వరకు తనిఖీలు సాగాయి. ఈ క్రమంలోనే దస్త్రాల దహనం ఘటనకు సంబంధించి అధికారులు సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేశారు.

Madanapalle Files Burnt Case : పోలీసుల అదుపులో ఉన్న గౌతమ్‌ తేజను సీఐడీ అధికారులు విచారించారు. ఘటన సమయంలో బీరువాల్లోని ఆయిల్ క్యాన్లపై ఆయనను ప్రశ్నించారు. మరోవైపు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌ నాయుడు, అదనపు ఎస్పీ రాజ్ కమల్, డీఎస్పీ వేణుగోపాల్ బృందం కూడా వారిని విచారించారు.

సీఐడీకి చిక్కిన కీలక ఆధారాలు : మరోవైపు వైఎస్సార్సీపీ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు, దందాల బాధితులు ఫిర్యాదులపైనా అధికారులు చర్యలు చేపట్టారు. ఆధారాలతో నిర్దేశించిన సమయానికి కార్యాలయానికి రావాలని బాధితుల్ని సూచిస్తున్నారు. వారికి న్యాయం చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే సమయంలో ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీఐడీ బృందాలు పెద్దిరెడ్డి ప్రధాన అనుచరులు మాధవరెడ్డి, శశికాంత్‌ నివాసాల్లో స్వాధీనం చేసుకున్న ఆధారాలను విశ్లేషిస్తున్నారు.

వివాదాస్పద భూముల లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలతోపాటు ఐపాడ్, పెన్‌డ్రైవ్‌లు, బ్యాంక్‌ స్టేట్‌మెంట్లను క్షుణ్ణంగా సీఐడీ బృందాలు పరిశీలిస్తున్నారు. ఇందులో జగన్‌ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు ముఖ్యమైన వివరాలు ఉన్నట్లు సమాచారం. వాటిపైనా సీఐడీ అధికారులు కూపీ లాగుతున్నారు. లభించిన ఆధారాలు, సమాచారంతో పాటు మద్యంపై తమ వద్దనున్న ఫిర్యాదులతో సరిపోల్చుతూ దర్యాప్తు చేస్తున్నారు.

అసలేం జరిగిదంటే : అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో గత నెల 21న అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ క్రమంలోనే ప్రధాన కార్యాలయంలోని రెవెన్యూ రికార్డులు, కంప్యూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. కార్యాలయ సిబ్బంది సమాచారం మేరకు ఫైర్ సిబ్హంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. అప్పటికే కార్యాలయంలోని విలువైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. అయితే నూతన సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందు జరిగిన ఈ ఘటనపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇది అగ్నిప్రమాదమా?, కుట్ర పూరితమా? అనే కోణంలో విచారణను ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన విషయం తెలిసిందే.

మదనపల్లె అగ్నిప్రమాదం కేసు - ఎంఆర్‌ఐ డేటాలో వెలుగులోకి కీలక విషయాలు - Madanapalle Fire Accident Case

మదనపల్లె కేసులో కీలక పరిణామాలు-పెద్దిరెడ్డి పీఏ ఇంట్లో పలు ఫైల్స్ స్వాధీనం - MADANAPALLE FIRE ACCIDENT CASE

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.