ETV Bharat / state

తెలంగాణ బడ్జెట్​ 2024 - ఆరు గ్యారంటీలకు ఎంత కేటాయించారంటే? - TELANGANA BUDGET 2024

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 25, 2024, 1:49 PM IST

Telangana Budget Allocations For Six Guarantees : ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్​ పార్టీ తెలంగాణ బడ్జెట్​లో భారీ కేటాయింపులు చేసింది. అయితే ఏ పథకానికి ఎన్ని నిధులు మంజూరు చేసిందో తెలుసుకుందాం.

telangana_budget_2024
తెలంగాణ బడ్జెట్​ 2024 - ఆరు గ్యారంటీలకు ఎంత కేటాయించారంటే? (ETV Bharat)

Budget Allocation for Six Guarantees in Telangana 2024 : తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బడ్జెట్​ ప్రవేశ పెట్టారు. ఎన్నికల సమయంలో గ్యారంటీల జల్లు కురిపించిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్​లో కేటాయింపులు చేసింది. అందులో రూ.500 గ్యాస్​ సిలిండర్​ పథకానికి రూ.723 కోట్లు కేటాయించింది. అలాగే గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్ల నిధులు మంజూరు చేసింది.

గృహజ్యోకి పథకానికి ఎంతంటే? : అల్పాదాయ కుటుంబాలకు ఉచిత విద్యుత్​ అందించడానకి తీసుకువచ్చిన గృహజ్యోతి పథకం ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్​ ఉపయోగించే ఇళ్లకు ఉచిత కరెంట్​​ అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా వచ్చి దరఖాస్తులను తీసుకుని అర్హులైన వారందరికి ఉచిత విద్యుత్​ను ప్రభుత్వం అందిస్తుంది. జులై 15నాటికి 45,81,676 గృహాలకు ఉచిత విద్యుత్​ను అందించారు. ఈ పథకం కింద జూన్​ వరకు సప్లై చేసిన విద్యుత్​కు డిస్కంలకు ప్రభుత్వం అందించిన మొత్తం రూ.585.05 కోట్లు చెల్లించింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో ఈ స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,148 కోట్లు ప్రతిపాదించింది.

పోలవరం ప్రాజెక్ట్​పై తొలగిన నీలినీడలు - నిధులిచ్చి పూర్తి చేస్తామని కేంద్రం స్పష్టం - Centre to Fully Finance Polavaram

రూ.500కే గ్యాస్ సిలిండర్​ : నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల తరచుగా పెరిగే గ్యాస్​ సిలిండర్​ ధరలు మోయలేని భారంగా మారాయని, వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్​ ధర వారికి ఒక ఆర్థిక సమస్యగా భావించి రూ.500కే గ్యాస్​ సిలిండర్ పథకాన్ని కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంటగ్యాస్ సిలిండర్​ను అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 39,57,637కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.200 కోట్లు వెచ్చించగా తాజాగా బడ్జెట్​లో రూ.723 కోట్లు కేటాయించింది.

కేంద్ర బడ్జెట్​లో చేయూత - మారిపోనున్న రాయలసీమ ముఖచిత్రం - Union Budget Funds to AP

ఇందిరమ్మ ఇళ్లు : పూటగడవని నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వం కర్తవ్యంగా భావించి ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ప్రారంభించింది. ఈ పథకం నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇళ్లు కట్టుకోడానికి పేదలకు రూ.5లక్షల ఆర్థిక సహాయం చేస్తుంది. ఎస్టీ, ఎస్సీ లబ్ధిదారులకు రూ.6లక్షల సహాయం అందించనుంది.

కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా - అమరావతికి రూ.15 వేల కోట్లు - AP Special Financial Assistance

Budget Allocation for Six Guarantees in Telangana 2024 : తెలంగాణ అసెంబ్లీలో ఆర్థికశాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క బడ్జెట్​ ప్రవేశ పెట్టారు. ఎన్నికల సమయంలో గ్యారంటీల జల్లు కురిపించిన కాంగ్రెస్​ ప్రభుత్వం ఈ సారి బడ్జెట్​లో కేటాయింపులు చేసింది. అందులో రూ.500 గ్యాస్​ సిలిండర్​ పథకానికి రూ.723 కోట్లు కేటాయించింది. అలాగే గృహజ్యోతి పథకానికి రూ.2,418 కోట్ల నిధులు మంజూరు చేసింది.

గృహజ్యోకి పథకానికి ఎంతంటే? : అల్పాదాయ కుటుంబాలకు ఉచిత విద్యుత్​ అందించడానకి తీసుకువచ్చిన గృహజ్యోతి పథకం ఈ ఏడాది మార్చి 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 200 యూనిట్ల కంటే తక్కువ విద్యుత్​ ఉపయోగించే ఇళ్లకు ఉచిత కరెంట్​​ అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ప్రజాపాలన సేవా కేంద్రాల ద్వారా వచ్చి దరఖాస్తులను తీసుకుని అర్హులైన వారందరికి ఉచిత విద్యుత్​ను ప్రభుత్వం అందిస్తుంది. జులై 15నాటికి 45,81,676 గృహాలకు ఉచిత విద్యుత్​ను అందించారు. ఈ పథకం కింద జూన్​ వరకు సప్లై చేసిన విద్యుత్​కు డిస్కంలకు ప్రభుత్వం అందించిన మొత్తం రూ.585.05 కోట్లు చెల్లించింది. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో ఈ స్కీమ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2,148 కోట్లు ప్రతిపాదించింది.

పోలవరం ప్రాజెక్ట్​పై తొలగిన నీలినీడలు - నిధులిచ్చి పూర్తి చేస్తామని కేంద్రం స్పష్టం - Centre to Fully Finance Polavaram

రూ.500కే గ్యాస్ సిలిండర్​ : నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల తరచుగా పెరిగే గ్యాస్​ సిలిండర్​ ధరలు మోయలేని భారంగా మారాయని, వారి ఆదాయంతో పోలిస్తే పెరిగిన సిలిండర్​ ధర వారికి ఒక ఆర్థిక సమస్యగా భావించి రూ.500కే గ్యాస్​ సిలిండర్ పథకాన్ని కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. మహాలక్ష్మి పథకం కింద రూ.500కే వంటగ్యాస్ సిలిండర్​ను అందిస్తున్నారు. ఇప్పటివరకు ఈ పథకం ద్వారా 39,57,637కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ఈ పథకానికి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.200 కోట్లు వెచ్చించగా తాజాగా బడ్జెట్​లో రూ.723 కోట్లు కేటాయించింది.

కేంద్ర బడ్జెట్​లో చేయూత - మారిపోనున్న రాయలసీమ ముఖచిత్రం - Union Budget Funds to AP

ఇందిరమ్మ ఇళ్లు : పూటగడవని నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వం కర్తవ్యంగా భావించి ఇందిరమ్మ ఇండ్లు అనే పథకం ప్రారంభించింది. ఈ పథకం నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇళ్లు కట్టుకోడానికి పేదలకు రూ.5లక్షల ఆర్థిక సహాయం చేస్తుంది. ఎస్టీ, ఎస్సీ లబ్ధిదారులకు రూ.6లక్షల సహాయం అందించనుంది.

కేంద్ర బడ్జెట్​లో రాష్ట్రానికి ప్రత్యేక పేరా - అమరావతికి రూ.15 వేల కోట్లు - AP Special Financial Assistance

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.