ETV Bharat / politics

బీఆర్​ఎస్​కు మరో షాక్​ - కాంగ్రెస్​లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య - BRS MLA Kale Yadaiah join Congress

Chevella MLA Kale Yadaiah joined in Congress: తెలంగాణలో బీఆర్​ఎస్​ పార్టీకి మరో షాక్​ తగిలింది. కాంగ్రెస్​ పార్టీలోకి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య చేరారు. దిల్లీలోని సీఎం రేవంత్​ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్​లో ఆరుగురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు చేరడంతో శాసనసభలో సభ్యుల బలం 72కి చేరింది.

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 28, 2024, 4:50 PM IST

BRS_MLA_Kale_Yadaiah_Joined_in_Congress
BRS_MLA_Kale_Yadaiah_Joined_in_Congress (ETV Bharat)

BRS MLA Kale Yadaiah joined in Congress: తెలంగాణలో బీఆర్​ఎస్​కు షాక్​లు మీద షాక్​లు ఇస్తూ కాంగ్రెస్​ పార్టీలోకి చేరికలు రోజు రోజుకీ జోరందుకుంటున్నాయి. తాజాగా బీఆర్​ఎస్​ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్​ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

దీంతో ఇప్పటివరకు ఆరుగురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్​కు ఇప్పటివరకు ఉన్న 65 సభ్యుల బలం సీపీఐతో కలిపి 66కు చేరుకుంది. ఇప్పుడు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ఆరుగురు చేరడంతో 72కి సభ్యుల బలం పెరిగింది. దీంతో శాసనసభలో బీఆర్​ఎస్​కు 32 మంది, బీజేపీకి 8 మంది, ఎంఐఎం పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు.

బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్​ - కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి - CM Revanth Met Pocharam Srinivas

కాంగ్రెస్​ పార్టీలో చేరిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు : ముందుగా ఎన్నికల ఫలితాలు తర్వాత రెండు నెలల్లో దానం నాగేందర్​ బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​ గూటికి చేరారు. ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బీఆర్​ఎస్​లో సీనియర్​ నేత స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్​ పార్టీ కండువా కప్పుకొని, వరంగల్​ ఎంపీగా తన కుమార్తె కడియం కావ్యకు టికెట్​ ఇప్పించుకుని గెలిపించుకున్నారు.

ఇప్పుడు వారం రోజుల క్రితం బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి హస్తం గూటికి చేరారు. పోచారం జాయిన్​ అయిన రెండు రోజుల గ్యాప్​లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ కాంగ్రెస్​లో చేరారు. ఇప్పుడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్​ఎస్​ అభ్యర్థి ఓడిపోయి కాంగ్రెస్​ గెలవడంతో ఇప్పుడు బీఆర్​ఎస్​ బలం 32మందికి చేరుకుంది. ఇంకా మరింత మంది కాంగ్రెస్​ పార్టీలో చేరతారని కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సమాచారం.

బీఆర్​ఎస్​ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ - Congress Focus on Merger of BRSLP

BRS MLA Kale Yadaiah joined in Congress: తెలంగాణలో బీఆర్​ఎస్​కు షాక్​లు మీద షాక్​లు ఇస్తూ కాంగ్రెస్​ పార్టీలోకి చేరికలు రోజు రోజుకీ జోరందుకుంటున్నాయి. తాజాగా బీఆర్​ఎస్​ చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. దిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్​ మున్షీ సమక్షంలో ఆయన కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. సీఎం రేవంత్​ రెడ్డి బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

దీంతో ఇప్పటివరకు ఆరుగురు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్​కు ఇప్పటివరకు ఉన్న 65 సభ్యుల బలం సీపీఐతో కలిపి 66కు చేరుకుంది. ఇప్పుడు బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు ఆరుగురు చేరడంతో 72కి సభ్యుల బలం పెరిగింది. దీంతో శాసనసభలో బీఆర్​ఎస్​కు 32 మంది, బీజేపీకి 8 మంది, ఎంఐఎం పార్టీకి 7 మంది ఎమ్మెల్యేలు సభ్యులుగా ఉన్నారు.

బీఆర్​ఎస్​కు బిగ్​ షాక్​ - కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్​ రెడ్డి - CM Revanth Met Pocharam Srinivas

కాంగ్రెస్​ పార్టీలో చేరిన బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు : ముందుగా ఎన్నికల ఫలితాలు తర్వాత రెండు నెలల్లో దానం నాగేందర్​ బీఆర్​ఎస్​ను వీడి కాంగ్రెస్​ గూటికి చేరారు. ఆ తర్వాత భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్​ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత బీఆర్​ఎస్​లో సీనియర్​ నేత స్టేషన్​ ఘన్​పూర్​ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సైతం కాంగ్రెస్​ పార్టీ కండువా కప్పుకొని, వరంగల్​ ఎంపీగా తన కుమార్తె కడియం కావ్యకు టికెట్​ ఇప్పించుకుని గెలిపించుకున్నారు.

ఇప్పుడు వారం రోజుల క్రితం బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి హస్తం గూటికి చేరారు. పోచారం జాయిన్​ అయిన రెండు రోజుల గ్యాప్​లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్​ కుమార్​ కాంగ్రెస్​లో చేరారు. ఇప్పుడు చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య కాంగ్రెస్​ కండువా కప్పుకున్నారు. సికింద్రాబాద్​ కంటోన్మెంట్​ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీఆర్​ఎస్​ అభ్యర్థి ఓడిపోయి కాంగ్రెస్​ గెలవడంతో ఇప్పుడు బీఆర్​ఎస్​ బలం 32మందికి చేరుకుంది. ఇంకా మరింత మంది కాంగ్రెస్​ పార్టీలో చేరతారని కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి సమాచారం.

బీఆర్​ఎస్​ ఎల్పీని విలీనం చేసుకునే దిశగా కాంగ్రెస్ - Congress Focus on Merger of BRSLP

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.