తెలంగాణ

telangana

By

Published : Aug 18, 2022, 12:57 PM IST

ETV Bharat / videos

కర్రలు, బెల్టులతో విద్యార్థిని చితకబాదిన దుండగులు

కొందరు దుండగులు కలిసి ఓ విద్యార్థిని దారుణంగా కొట్టారు. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ గోండా జిల్లాలోని మన్​కాపుర్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో జరిగింది. తాలిబన్ల రీతిలో చితకబాదినట్లు దృశ్యాల్లో కనిపిస్తోంది. కర్రలు, చెప్పులు, బెల్టులతో చిత్రహింస చేశారు. విడిచిపెట్టమని ఎంత వేడుకున్నా.. కనికరించలేదు. చివరికి ప్రాణాపాయ స్థితిలో వదిలివెళ్లారు. దుండగులు విద్యార్థిని ఎందుకు కొట్టారో కారణాలు ఇంతవరకు తెలియలేదు. ఈ వీడియో ఆధారంగా దారుణానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఆ జిల్లా ఎస్పీ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details