Prathidwani: ఎల్ఐసీ ఐపీఓలో పర్సంటేజీలను ఏ ప్రాతిపదికన నిర్ణయించారు? - Prathidwani debate on LIC IPO
కోట్లాది మంది భారతీయుల జీవితాలకు బీమా కల్పించిన ఎల్ఐసీ... మొదటిసారి పబ్లిక్ ఇష్యూలో వాటాలు విక్రయిస్తోంది. పెద్దస్థాయి ఇన్వెస్టర్లకు సింహభాగం షేర్లు కేటాయించిన ఈ ఐపీఓలో పాలసీదారులు, ఉద్యోగాలు, రిటైలర్లకు కూడా ప్రభుత్వం కొంత వాటా కల్పించింది. వాటాల విక్రయాన్ని మొదటి నుంచి ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ విలువను లెక్కించిన తీరుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఎల్ఐసీ షేర్ల ధరల నిర్ధారణ ఎలా జరిగింది? ఎల్ఐసీ ఐపీఓతో లాభపడేది ఎవరు? ఇదే అంశంపై ఈ రోజు ప్రతిధ్వని.