ఫీజుల దోపిడీకి గురవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు దిక్కెవరు
Prathidhwani రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజుల దందాకు మళ్లీ తెరలేచింది. బీ- కేటగిరి సీట్లను యథేచ్ఛగా అమ్ముకుంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నోటిఫికేషన్ రాకముందే, విధివిధానాలు ఖరారు కాకముందే, కళాశాలల యజమానులు విద్యార్థుల తల్లిదండ్రులతో బేరసారాలు నడుపుతూ, లక్షల రూపాయల డొనేషన్లు వసూలు చేస్తున్నారన్న విమర్శలూ ఉన్నాయి. ఏటా ఇలాంటి విమర్శలు వస్తోన్నా ఉన్నత విద్యామండలి ఎందుకు నియంత్రించలేకపోతోంది. అసలు బీ- కేటగిరి సీట్ల విధానమేంటి. ఇంజినీరింగ్కు సంబంధించిన వివిధ అంశాలపై ఈటీవీ భారత్ ప్రతిధ్వని