శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వేడుకలు - తెలంగాణ వార్తలు
శ్రీ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి సందర్భంగా సికింద్రాబాద్ పద్మారావు నగర్ స్కందగిరి ఆలయంలో స్వామివారిని సుందరంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్త జనంతో స్కందగిరి ఆలయ ప్రాంగణం సుబ్రహ్మణ్య స్వామి నామ స్మరణతో మారుమోగుతోంది.