తెలంగాణ

telangana

ETV Bharat / videos

prathidwani: పోడు భూముల సమస్యకు పరిష్కారం ఎప్పటికి? - etv bharat prathidwani debate

By

Published : Jul 3, 2021, 9:24 PM IST

Updated : Jul 3, 2021, 9:38 PM IST

తరతరాలుగా గిరిజనుల జీవనాధారం పోడు వ్యవసాయం. అడవినే నమ్ముకుని బతుకుతున్న ఆదివాసులు ఆ పోడు భూములపై హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. దశాబ్దంనర క్రితం ప్రభుత్వం తెచ్చిన ఆటవీ హక్కుల గుర్తింపు చట్టంతో గిరిజనుల హక్కులకు రక్షణ లభిస్తుందన్న ఆశలు చిగురించాయి. అయితే.. చట్టాల అమలులో లోపాలు, గిరిజనుల అవగాహన రాహిత్యం పోడు భూముల సమస్యను ఎప్పటికప్పుడు జఠిలంగా మార్చేస్తున్నాయి. ఫలితంగా రైతులు, అధికారుల మధ్య తరచూ ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. ఏటా ఏరువాక సమయంలో పోడు భూముల సమస్య మళ్లీ మళ్లీ ఎందుకు తలెత్తుతోంది? చట్టాల అమలులో లోపాలను అధిగమించడం ఎలా? ఇదే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
Last Updated : Jul 3, 2021, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details