తెలంగాణ

telangana

ప్రతిధ్వని: భారత్, అమెరికా సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి?

By

Published : Nov 19, 2020, 9:36 PM IST

భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ల వ్యక్తిగత సాన్నిహిత్యం రెండు దేశాల మధ్య బలమైన బాంధవ్యానికి దారి తీసింది. అమెరికా ఎన్నికల్లో జో బైడెన్ గెలిచిన నేపథ్యంలో భారత్, అమెరికా సంబంధాలపై అనేక సందేహాలు నెలకొన్నాయి. తీవ్రవాదం, వాతావరణ మార్పు, ప్రపంచ ఆరోగ్యం, అంతర్జాతీయ సవాళ్లను ఎదుర్కొవడంలో భారత్​తో కలిసి పనిచేస్తానని జోబైడెన్ ఇప్పటికే స్పష్టం చేశారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో కలిసి పనిచేసేందుకు తాను ఎదురుచూస్తున్నాని తెలిపారు. భారత సంతతికి చెందిన కమలా హారిస్ అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయ్యారు. జోబైడెన్ మంత్రివర్గంలో ఇద్దరు భారతీయ అమెరికన్లకు కూడా చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్, అమెరికా సంబంధాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే అంశంపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

...view details