సాగర తీరం.. కట్టిపడేసిన యుద్ధ నౌకల విన్యాసం - విశాఖపట్నం తాజా వార్తలు
భారత కోస్ట్ గార్డు 45వ రైజింగ్ డే సందర్భంగా విశాఖ సాగర తీరంలో విన్యాసాలు నిర్వహించారు. కోస్ట్ గార్డుకి చెందిన యుద్ద నౌకలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. సాయంకాల వేళ ఆర్కే బీచ్లో... ఈ విన్యాసాలు అక్కడి వారిని ఆకట్టుకున్నాయి. హెలికాప్టర్లు... నౌకల సమన్వయంతో కోస్టు గార్డు సిబ్బంది చేసిన విన్యాసాలు కట్టి పడేశాయి.