భగీరథ అవుతోంది వృథా... - pallipadu
ఖమ్మం జిల్లా పల్లిపాడు సమీపంలోని మిషన్ భగీరథ గేట్ వాల్ లీక్ అవడం వల్ల నీరంతా వృథాగా పోయింది. ఆ నీటితో వైరా-పల్లిపాడు జాతీయ రహదారి పక్కన కాలువలు నిండిపోయాయి. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న జలధారలను అటు వైపుగా వెళ్తోన్న ప్రయాణికులు ఆసక్తిగా తిలకించారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నీరంతా వృథాగా పోతోందని పలువురు ఆవేదన చెందారు.