తెలంగాణ

telangana

Youth Made e Bike At Home

ETV Bharat / videos

వండర్​ బైక్​ 250- రూ.8 ఖర్చుతో 30కి.మీ జర్నీ!

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 3:49 PM IST

Youth Made e Bike At Home : అసోం తేజ్​పుర్​కు చెందిన మస్కుల్​ ఖాన్​ అనే విద్యార్థి వినూత్న ఈ-బైక్​ను రూపొందించాడు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఎలక్ట్రిక్​ బైక్​ను తయారు చేశాడు. దీనికి 'వండర్​ బైక్ 250' అని పేరు పెట్టాడు. తన సృజనాత్మకతతో ఈ బైక్​ రూపొందించి సర్వత్రా ప్రశంసలు అందుకుంటున్నాడు.

రూ.8 ఖర్చుతో 30 కిలోమీటర్ల ప్రయాణం!
ఈ స్పెషల్​ బైక్​ కేవలం 8 రూపాయల ఖర్చుతో సుమారు 30 కిలోమీటర్లు ప్రయాణించగలదు. 30 కిలోల బరువున్న ఈ బైక్​, సుమారు 80-100 కిలోల బరువును మోయగలదు. ఐదు గంటల్లోనే ఈ బైక్​ ఫుల్ ఛార్జ్ అవుతుంది.

కరోనా కాలంలో ఇంట్లో ఉంటూ ఈ సైకిల్​
కరోనా ఉద్ధృతి సమయంలో ఇంట్లోనే ఉన్న మస్కుల్ ఖాన్..​ ఈ-సైకిల్​ను తయారు చేశాడు. ఆ తర్వాత అదే స్ఫూర్తితో ఈ-బైక్​ను రూపొందించాడు. భవిష్యత్తులో ఈ-కార్​ను సైతం రూపొందిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడీ కుర్రాడు. ఈ ప్రయాణంలో తన తండ్రి ఎల్లప్పుడూ అండగా ఉన్నాడని తెలిపాడు.

ABOUT THE AUTHOR

...view details