తెలంగాణ

telangana

పొంగులేటి శ్రీనివాసరెడ్డి

By ETV Bharat Telangana Team

Published : Nov 28, 2023, 9:53 AM IST

ETV Bharat / videos

ఉచిత కరెంటు ప్రవేశ పెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Ponguleti SrinivasaReddy Interview : రాష్ట్రంలో రాబోయేది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆ పార్టీ ప్రచార కమిటీ కో ఛైర్మన్ , పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 70కి పైగా స్థానాల్లో గెలిచి ప్రభుత్వం కొలువు దీరుతుందని అన్నారు. రాష్ట్రంలో బీఆర్​ఎస్​ అవినీతి, అరాచక పాలనకు చరమగీతం పాడాలని ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. అందుకే కాంగ్రెస్ ప్రచారానికి జనం ప్రభంజనంలా వస్తున్నారని వెల్లడించారు.

Ponguleti Fires On KCR :ఉచిత కరెంటుపై కేసీఆర్‌, కేటీఆర్‌ అసత్య ప్రచారాలు చేస్తున్నారని పొంగులేటి మండిపడ్డారు. ఉచిత కరెంటు ప్రవేశపెట్టిందే కాంగ్రెస్‌ పార్టీ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్​ పార్టీ ప్రజాస్వామ్య బద్దంగా నడుచుకుంటుందని .. బీఆర్ఎస్​ పాలన నియంత, హిట్లర్​ పాలనను తలపిస్తోందని విమర్శించారు. అధిష్ఠానం సూచన మేరకే తామంతా నడుచుకుంటామని వెల్లడించారు. తొలిసారి అసెంబ్లీ బరిలో నిలిచిన తనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్న పొంగులేటి శ్రీనివాస రెడ్డితో ముఖాముఖి. 

ABOUT THE AUTHOR

...view details