తెలంగాణ

telangana

MP Asaduddin on Telangana Elections

ETV Bharat / videos

MP Asaduddin on Telangana Elections : ఈసారి ఎన్నికల్లో కూడా కేసీఆర్​దే విజయం: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 7:51 PM IST

MP Asaduddin on Telangana Elections : ముఖ్యమంత్రి  కేసీఆర్​  మూడోసారి ముఖ్యమంత్రి అవుతారని విశ్వాసం ఉందని... ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధి, మతసామరస్య పరిరక్షణలో మేటిగా నిలిచిన తెలంగాణలో మరోసారి బీఆర్​ఎస్​ విజయం సాధిస్తుందని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో కూడా ఎంఐఎం పార్టీ బీఆర్​ఎస్​తో పొత్తుకు వెళుతుందని తెలిపారు.  తమ పార్టీ నాయకులు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా కచ్చికంగా విజయం సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

తమ పార్టీ నాయకులు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది త్వరలో నిర్ణయించుకున్నామని తెలిపారు. ఓటర్లు బీజేపీ నాయకుల నుంచి జాగ్రత్తగా ఉండాలనీ అసదుద్దీన్ సూచించారు. తెలంగాణలో బీఆర్​ఎస్ తప్ప ఏ పార్టీ అధికారంలోకి రాదన్నారు. పదేళ్ల నుంచి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని తెలిపారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అందరు చూస్తున్నారని... కేసీఆర్ చేసిన అభివృద్ధే ఆయనను గెలిపిస్తుందని అసద్ ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details