బండెనక బండి కట్టి... వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు వెళదాం.. - తెలంగాణ జాతరలు
Kothakonda edlabandlu in hanmakonda: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొత్తపల్లి గ్రామం నుంచి 60 ఎడ్ల బండ్లపై ప్రత్యేక అలంకరణతో గ్రామస్థులు కొత్తకొండ జాతరకు తరలి వెళ్లారు. గ్రామానికి చెందిన యువత నేటికీ పురాతనం నుంచి ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. నేటి ఆధునికతకు తగ్గట్టుగా ఎడ్ల బండ్లపై డీజే బాక్సులు, డిస్కో లైట్లతో ప్రత్యేక అలంకరణ చేసుకొని ఉత్సాహంగా ఎడ్లబండ్ల ప్రదక్షిణకు వెళ్లడం విశేషం. శ్రీ వీరభద్ర స్వామి దేవాలయానికి చేరుకున్న ఎడ్లబండ్ల రథాలు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేశాయి.
ఇవీ చదవండి: