Heroines Attend Electric Scooter Showroom Opening Ceremony : నగరంలో సందడి చేసిన హెబ్బా పటేల్, ఇషా చావ్లా - Eco Friendly Electric Scooters Showroom
Heroines Start Electric Scooter Showroom in Hyderabad : భాగ్య నగరంలో పర్యావరణ హిత ఎలక్ట్రిక్ స్కూటర్స్ షోరూమ్ ప్రారంభోత్సవంలో టాలీవుడ్ తారలు సందడి చేశారు. ఈ వేడుకల్లో సినీ తారలు ఇషా చావ్లా, పూజితా పొనాడ, హెబ్బా పటేల్ పాల్గొని అలరించారు. వీరిని చూసేందుకు అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ షో రూమ్ను నారాయణగూడ కూడలిలో ప్రారంభించగా.. తారలు స్కూటర్స్లో ఉన్న వివిధ రకాల మోడల్స్ను ట్తై చేశారు. ఈ సందర్భంగా షో రూమ్ ఎండీ మాట్లాడుతూ.. నగరంలో మొట్టమొదటి పర్యావరణహిత షోరూమ్ అని తెలిపారు. నగర ప్రాంతాల్లో ప్రయాణ సదుపాయాల్లో విప్లవాత్మక మార్పును తీసుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు అందుబాటు ధరలోనే లభిస్తాయని వెల్లడించారు. త్వరలో మరిన్ని షో రూమ్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. స్కూటర్లను స్థిరత్వం, సౌలభ్యం, శైలి, భద్రతల మిశ్రమంగా రూపొందించారని స్పష్టం చేశారు. సినీ తారలు మాట్లాడుతూ.. ఈ స్కూటర్లు పర్యావరణానికి మేలు చేస్తాయని చెప్పారు.