PRATHIDHWANI బదిలీలు, పదోన్నతుల ప్రక్రియపై ప్రభుత్వ మార్గదర్శకాలు ఎలా - ఉపాధ్యాయుల బదిలీలపై ప్రతిధ్వని
ఎన్నో ఏళ్లుగా ఉపాధ్యాయులు ఎదురు చూస్తోన్న బదిలీలు, పదోన్నతులకు ఆదేశాలు వెలువరించింది రాష్ట్రప్రభుత్వం. ఇంకా పూర్తిస్థాయి మార్గదర్శకాలు వెలువడకుండానే ఉపాధ్యాయుల నుంచి వినతుల వెల్లువ మొదలైంది. జీవో 317 తర్వాత మెదటిసారి జరుగుతోన్న ప్రక్రియ కావడంతో ఈ వినతుల తాకిడి ఎక్కువ ఉంది. అయితే ఈ ప్రక్రియకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం మార్గదర్శకాలు ఎలా ఉండబోతున్నాయి? ఉపాధ్యాయుల వినతులు, అభ్యంతరాల పరిష్కారానికి చోటు లభిస్తుందా? ఎలాంటి వివాదాలూ లేకుండా బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ పారదర్శకంగా జరగాలంటే ప్రభుత్వం ఏంచేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.