కరోనా కొత్త కలవరం - ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - భారత్లో పెరుగుతున్న కరోనా కేసులు
Published : Dec 21, 2023, 10:49 PM IST
Corona Threat Increasing in India: కనుమరుగై పోయింది అనుకున్న కరోనా మళ్లీ కలవర పెడుతోంది. కొత్తవేరియంట్ రూపంలో కొన్నిరోజులుగా ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. పెరుగుతున్న కేసులు, జాగ్రత్తలు తప్పనిసరి అన్న సూచనలు అందరిలో ఒకరకమైన భయాన్ని కలిగిస్తున్నాయి. అసలు ఈ కొత్త రకం కరోనా ఎక్కడి నుంచి ఎలా వచ్చింది? అది ఎంత ప్రమాదకరం? కొత్త వేరియెంట్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఈ విషయంలో వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు? ప్రజలంతా అవగాహనతో పాటు ఎలాంటి ముందు జాగ్రత్తలతో ఉంటే మేలు?
సాధారణంగా ఇలాంటి ఏ హెచ్చరిక వచ్చినా ముందు భయపడేది పిల్లలు, వృద్ధుల గురించే. వారి విషయంలో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు, అప్రమత్తత అవసరం? రోనా తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు...వదంతులు, తప్పుడు ప్రచారం, సొంతవైద్యాలపోస్ట్లు, పిచ్చి రెసిపీలు వంటి విపరీతాలెన్నో చూశాం. ఇప్పుడీ విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరం? ముప్పు చిన్నదైనా, పెద్దదైనా, కరోనా వంటి ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందే ఈ వ్యాధుల విషయంలో ప్రతిఒక్కరికి కరోనాకాలం నేర్పిన పాఠాల్ని మరిచిపోకుండా ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.