తెలంగాణ

telangana

ETV Bharat / videos

కిరాణ దుకాణంలోకి చొరబడి యువకుడి కిడ్నాప్.. అంతా చూస్తుండగానే.. ​

By

Published : Jun 2, 2022, 9:34 PM IST

Updated : Feb 3, 2023, 8:23 PM IST

ఓ కిరాణ దుకాణంలోనుంచి యజమాని కుమారుడిని కిడ్నాప్​ చేసిన సంఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో గురువారం ఉదయం జరిగింది. ఉదయం 7గంటల ప్రాంతంలో ఆరుగురు దుండగలు షాప్​లోకి చొరబడి అపహరించారు. రాజస్థాన్​కు చెందిన ముల్లారామ్​ అనే వ్యక్తి చిన్నకడాయ్​ గ్రామంలో కిరాణ దుకాణం నడుపుతున్నారు. గురువారం ఉదయం దుకాణంలోని ఆయన కుమారుడు జయరామ్​ వెళ్లాడు. 7గంటల ప్రాంతంలో ఆరుగురు దుండగులు షాప్​లోకి వచ్చి జయరామ్​తో గొడవకు దిగారు. ఆ తర్వాత దుకాణంలోంచి లాక్కెళ్లి మినీ ట్రక్కులో ఎక్కించుకుని వెళ్లారు. ముల్లారామ్​ ఫిర్యాదు మేరకు సేలం టౌన్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Last Updated : Feb 3, 2023, 8:23 PM IST

ABOUT THE AUTHOR

...view details