తెలంగాణ

telangana

Car Collided With A Tractor Karnataka

ETV Bharat / videos

పెళ్లి నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం- ట్రాక్టర్​ను ఢీకొట్టిన కారు- తల్లీకుమారుడు మృతి - కర్ణాటక దావణగెరె కారు ప్రమాదం లైవ్

By ETV Bharat Telugu Team

Published : Dec 9, 2023, 1:20 PM IST

Car Collided With A Tractor Karnataka :వేగంగా వెళ్తున్న ఓ కారు అదుపుతప్పి ట్రాక్టర్​ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా పలువురికి గాయాలయ్యాయి. కర్ణాటక దావణగెరె శివారులోని శిరమగోండనహళ్లి వంతెన సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన డిసెంబర్ 4 నాటికి కాగా తాజాగా సీసీటీవీ వీడియో బయటకు వచ్చింది.

సంబంధిత వర్గాల వివరాల ప్రకారం డిసెంబర్ 4న ఓ కుటుంబం హవేరీ జిల్లా హోస్రిట్టి నుంచి తుమకూరులో వివాహ కార్యక్రమానికి హాజరైంది. వివాహం ముగిసిన అనంతరం వారంతా తిరిగి కారులో ఇంటికి బయల్దేరారు. దావణగెరె శివారు సమీపానికి వచ్చేసరికి కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీంతో రహదారిపై వెళ్తున్న ఓ ట్రాక్టర్​ను వెనుక నుంచి ఢీకొట్టాడు. దీంతో కారు ముందు భాగం తీవ్రంగా ధ్వంసమైంది. ఘటనాస్థలిలోనే ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వీరిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నారు. మృతులను అరుణ్ శెట్టార్ (50), ఆయన తల్లి విజయలక్ష్మి శెట్టార్​ (70)గా గుర్తించారు. రహదారికి దగ్గర్లో ఉన్న ఓ భవానానికి అమర్చిన సీసీటీవీ కెమెరాలో ప్రమాదం దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ ఘటనపై విద్యానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details