తెలంగాణ

telangana

BRS Candidate Manchireddy Kishan Reddy Election Campaign

By ETV Bharat Telangana Team

Published : Nov 21, 2023, 10:51 PM IST

ETV Bharat / videos

బీఆర్ఎస్​ అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది : మంచిరెడ్డి కిషన్​రెడ్డి

BRS MLA Candidate Manchireddy Kishan Reddy Election Campaign : బీఆర్ఎస్​ అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నారని ఆ పార్టీ ఇబ్రహీంపట్నం అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఆయన విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని ఇంజాపూర్, మునగనూర్, తొర్రూర్, బ్రాహ్మణపల్లి గ్రామాల్లో రోడ్​షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ​ పార్టీకి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని మంచిరెడ్డి కిషన్​రెడ్డి కోరారు. 

కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, రోడ్లు, మంచినీటి వ్యవస్థ, డ్రైనేజీ పనుల్లో అభివృద్ధి సాధించిందని మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్​ మేనిఫెస్టోను ప్రజలు నమ్ముతున్నారని, కచ్చితంగా మరోసారి గులాబీ పార్టీ అధికారం చేపట్టబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు క్యామా మల్లేశ్​, దండం రామ్ రెడ్డి, కొత్త కురుమ సత్తయ్య, అమరేందర్ రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details