తెలంగాణ

telangana

BJP Etela Rajender

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2023, 5:24 PM IST

ETV Bharat / videos

కేసీఆర్ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అభివృద్ధి చేయలేదు: ఈటల రాజేందర్

BJP Etela Rajender Election Campaign in Nacharam :సీఎం కేసీఆర్అరచేతిలో వైకుంఠం చూపిస్తూ అభివృద్ధి చేయలేదని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఈటల రాజేందర్ ప్రత్యేక పూజలు చేసి ఎన్నికల ప్రచారం ప్రారభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని సందర్శించుకుని ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. కేసీఆర్ స్వామివారిని దర్శించుకుని రూ.100 కోట్లతో అభివృద్ధి చేస్తానని చెప్పి.. 10 ఏళ్లు అవుతున్న ఆలయ అభివద్ధికి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు. అభివృద్ధిని పక్కనపెట్టి ఇక్కడున్న దేవాలయ భూముల మీద కన్నేసారని మండిపడ్డారు. 

BJP Election Campaign in Nacharam :50, 60 ఏళ్ల క్రితం దళితులకు ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కోవాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని ధ్వజమెత్తారు. గ్రామాల్లో ప్రజలు తామే కథానాయకులమై ఈటలను గెలిపించుకుంటామని చెప్పడం సంతోషంగా ఉందని ధీమా వ్యక్తం చేశారు. బూతుకు 300 సీసాలు, రూ.50 వేలు ఐదు దఫాలుగా కేసీఆర్ ఇస్తాడట అని ఆరోపించారు. బీఆర్​ఎస్ వాళ్లు ఇచ్చేవన్ని తీసుకొని ఈటలకే ఓటేస్తామని ఇక్కడ యువత చెప్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్​ను ఓడగొట్టకపోతే గజ్వేల్ ప్రజలు బాగుపడరని.. తమ ఆత్మగౌరవం దెబ్బతింటుందని ప్రజలకు సూచించారు.

ABOUT THE AUTHOR

...view details