తెలంగాణ

telangana

abvp

By

Published : Mar 21, 2023, 3:38 PM IST

ETV Bharat / videos

ప్రగతిభవన్​ను ముట్టడించిన ఏబీవీపీ కార్యకర్తలు.. అడ్డుకున్న పోలీసులు

TSPSC Paper Leackage: రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ విషయంలో నేడు ప్రగతిభవన్​ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తలు యత్నించారు. ముట్టడికి ప్రయత్నించి ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి.. గోషామహల్​ పోలీస్​ స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించారని ఏబీవీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. టీఎస్​పీఎస్సీ పేపర్​ లీకేజీ విషయంపై సీఎం కేసీఆర్​ స్పందించాలని ఏబీవీపీ కార్యకర్తలు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్​పీఎస్సీ ఛైర్మన్​, కార్యదర్శులను వెంటనే బర్తరఫ్​ చేయాలన్నారు. సీఎం కేసీఆర్​ ఈ లీకేజీకు నైతిక బాధ్యత వహిస్తూ.. రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. పేపర్​ లీకేజీ విషయంపై సిట్టింగ్​ జడ్జితో విచారణ చేయాలని సూచించారు. ఈ కేసు సిట్​ నుంచి సీబీఐకు బదిలీ చేయాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details