వాయుసేన విమానాల్లో నుంచి కింద పడ్డ బాంబులు... భక్తులు హడల్! - Bomb Blast in Gwalior
Bomb Blast in Gwalior: మధ్యప్రదేశ్ దతియా జిల్లాలోని రతన్గఢ్ మాతా దేవాలయం ఉన్న అడవుల్లో పేలుళ్లు సంభవించాయి. విమానాల నుంచి ఒకదాని తర్వాత మరొకటి బాంబులు భూమిపై పడ్డాయి. దీంతో భారీ స్థాయిలో పొగలు వెలువడ్డాయి. పేలుళ్ల శబ్దం విని ఆలయానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. అయితే.. పేలుళ్లు జరిగిన అటవీ ప్రాంతం ఎయిర్ బేస్ పరిధిలోకి వస్తుందని జిల్లా ఎస్పీ అమన్ రాథోడ్ తెలిపారు. శిక్షణలో భాగంగా వైమానికి దళాలే ఈ పేలుళ్లు జరిపాయని వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST