తెలంగాణ

telangana

By

Published : Dec 6, 2019, 4:56 PM IST

Updated : Dec 6, 2019, 5:26 PM IST

ETV Bharat / videos

డ్యాన్స్​ మధ్యలో ఆపినందుకు తుపాకీతో దాడి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ పెళ్లి వేడుకలో నృత్యం చేస్తూ మధ్యలో ఆపేసిందని యువతిని కాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిత్రకూట్‌లో డిసెంబర్‌ 1న గ్రామ పెద్ద సుధీర్‌ సింగ్‌ పటేల్‌ కుమార్తె పెళ్లి వేడుకలో ఈ దారుణం జరిగింది. ఇద్దరు యువతులు నృత్యం చేస్తుండగా... వారిలో ఒకరు కాసేపు ఆగారు. నృత్యం ఆపితే కాల్చివేస్తానని వేడుకలు చూస్తున్న ఓ వ్యక్తి హెచ్చరించాడు. ఆమెపై దాడి చేయాలని మరో వ్యక్తి అనగా... క్షణాల్లోనే ఆ యువతి ముఖంపై దుండగుడు కాల్పులు జరిపాడు. బుల్లెట్‌ దవడలోకి దూసుకుపోయి స్టేజీపైనే కుప్పకూలిపోయింది ఆ యువతి. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. పెళ్లి కుమార్తె బంధువు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Last Updated : Dec 6, 2019, 5:26 PM IST

ABOUT THE AUTHOR

...view details