తెలంగాణ

telangana

By

Published : Sep 5, 2021, 12:26 PM IST

Updated : Sep 5, 2021, 1:04 PM IST

ETV Bharat / videos

Viral Video: చెలరేగిన దొంగలు.. తుపాకులతో బెదిరించి దుకాణం లూటీ

దిల్లీలో ముగ్గురు దుండగులు రెచ్చిపోయారు. ఓ హార్డ్​వేర్ షాపులోకి తుపాకులతో చొరబడి లూటీ చేశారు. కస్టమర్లను కూడా బెదిరించారు. యజమాని తలకు గన్​ ఎక్కుపెట్టి అందినకాడికి దోచుకుపోయారు. ఖేరా ఖుర్ద్ ప్రాంతంలో శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దుండగుల్లో ఒకరు ఒక బుల్లెట్ పేల్చారని పోలీసులు తెలిపారు. హెల్మెట్​, ముసుగు ధరించి ఉన్న వీరిని గుర్తించేందుకు పాత నేరస్థుల రికార్డులు తిరగేస్తున్నట్లు తెలిపారు.
Last Updated : Sep 5, 2021, 1:04 PM IST

ABOUT THE AUTHOR

...view details