మూడు బైక్లను ఢీకొట్టి.. ముగ్గురిని చంపి.. - Live accident visuals
రాజస్థాన్లోని జైపుర్-దిల్లీ రోడ్డుపై రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రహ్మపురి ప్రాంతంలోని ఈద్గా సమీపంలో వేగంగా వస్తోన్న ఓ ట్రక్కు అటుగా వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అనంతరం.. అదే తరహాలో మరో రెండు బైక్లనూ బలంగా తాకింది. ఇది జరిగిన కొద్దిసేపటికే ఆ ట్రక్కు సుమారు 2 కిలోమీటర్లు ప్రయాణంచి బోల్తాపడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ దృశ్యాలన్నీ స్థానిక సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.