మూడు వేల మంది ఒకేసారి సంగీతం ఆలపిస్తే..? - music performance
ఒడిశా బర్గఢ్లో అద్భుత ప్రతిభా ప్రదర్శన జరిగింది. దాదాపు మూడు వేల మందికి పైగా కళాకారులు కొండపై కరంసాని దేవతను కొనియాడుతూ.. తమ కళను ప్రదర్శించారు. రాగయుక్తంగా గానం చేస్తూ.. ఒకే శ్రుతిలో సంగీత వాద్యాలు వాయించి ప్రేక్షకులను కట్టిపడేశారు. లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కించుకునేందుకు ఇలా సామూహికంగా ప్రయత్నించారు.