పొగాకు నియంత్రణపై 'సైకత' సందేశం - పొగాకు వ్యతిరేక దినంపై సుదర్శన్ పట్నాయక్ ఆర్ట్
ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ వినూత్నంగా సందేశం ఇచ్చారు. పొగాకు వినియోగంపై ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పం తయారు చేశారు. పొగాకు వినియోగం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించేలా ఈ శిల్పాన్ని తీర్చిదిద్దారు. కరోనా కాలంలో పొగాకు తాగడం ఇతరులకు కూడా ప్రమాదకరమని తెలిపేలా కళాఖండాన్ని రూపోందించారు. సైకత శిల్పంతో పొగాకు వినియోగంపై ప్రజల్లో అవగాహన తీసుకువచ్చేందుకు ఇలా చేశానని తెలిపారు సుదర్శన్ పట్నాయక్. ఈ కళాఖండం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.