పల్లకిలో గర్భిణీ.. రోడ్డు లేక మంచులోనే మోసుకుంటూ...
హిమాచల్ ప్రదేశ్, చంబా జిల్లా భటియాత్ మండలం దంగోడి గ్రామం ప్రజలు రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామంలోని సోనూ కుమారి అనే మహిళకు పురిటి నొప్పులు రాగా ఇలా పల్లకి కట్టి కొండలు దాటుకుని తీసుకెళ్లారు. ఓ తాండాలో సోనూకుమారి ప్రసవించిన అనంతరం.. ఆమెను మళ్లీ పల్లకిలో మోసుకుంటూ ఆమెను ఇంటికి చేర్చారు కుటుంబసభ్యులు. ఏళ్లు గడుస్తున్నా తమ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Last Updated : Jan 26, 2022, 12:49 PM IST