తెలంగాణ

telangana

రెండు జిల్లాల పోలీసుల మధ్య ఘర్షణ.. ఎందుకంటే?

By

Published : Sep 7, 2021, 11:28 PM IST

Published : Sep 7, 2021, 11:28 PM IST

మధ్యప్రదేశ్​లో రెండు జిల్లాల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. చైన్​ స్నాచింగ్​ నిందితులను పట్టుకునేందుకు ఎగబడి, ప్రశంసల కోసం చివరికి ఘర్షణకు దిగారు(police clash in india). పన్నా, సత్నా జిల్లాలో ఈ మధ్యకాలంలో చైన్​ స్నాచింగ్​ నేరాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో బవారియా ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను చిత్రకూట్​ ప్రాంతంలో పన్నా జిల్లా పోలీసులు పట్టుకున్నారు. వారిని సత్నా జిల్లా పోలీసులు అడ్డగించి, నిందితులను అప్పజెప్పాలని డిమాండ్​ చేశారు. ఇది ఇరు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. దీనిపై స్పందించిన యంత్రాంగం.. నిందుతుల కోసం పోలీసులు గొడవ పడటం అన్నది అవాస్తమని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details