డ్యాం కూల్చిన పీతలు మంత్రి ఇంటికొచ్చాయ్! - Maharashtra Water Conservation Minister
మహారాష్ట్ర రత్నగరిలో తివారే ఆనకట్ట కూలిన ఘటనపై నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ(ఎన్సీపీ) కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. డ్యామ్ పీతల వల్లే కూలిందన్న నీటి సంరక్షణశాఖ మంత్రి తానాజీ సావంత్ నివాసం ఎదుట పీతలను తీసుకొచ్చి వదిలారు. తివారే ఆనకట్ట కూలిపోవడానికి పీతలే కారణమని మంత్రి అనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు.