గేట్ వే ఆఫ్ ఇండియాకు నూతన ఏడాది శోభ - NEW YEAR CELEBRATIONS
దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో నూతన సంవత్సరాది వేదుకలు ఘనంగా జరిగాయి. న్యూ ఇయర్ను పురస్కరించుకుని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద భారీ స్థాయిలో వేడుకలు నిర్వహించారు. విద్యుత్, బాణాసంచ కాంతులతో ఆ ప్రాంగాణం మెరిసిపోయింది. విద్యుత్ దీప కాంతుల అలంకరణ ఆద్యంతం ఆకట్టుకుంది. సంగీతానికి అనుగుణంగా విద్యుత్ కాంతులు జిగేల్మనడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. నగరవాసులు ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుతూ నూతన ఏడాదికి స్వాగతం పలికారు.