తెలంగాణ

telangana

By

Published : Oct 13, 2019, 2:09 PM IST

ETV Bharat / videos

చిరుత వేట: గుమ్మం ముందు నిద్రించే శునకాలే టార్గెట్​!

తమిళనాడు ఈరోడ్ జిల్లా​ సత్యమంగళం అటవీ ప్రాంతంలో ఓ చిరుత పులి, ఇంటి ముందు నిద్రిస్తున్న శునకాన్ని శుక్రవారం రాత్రి చాకచక్యంగా వేటాడింది. సత్యమంగళం పర్యటక ప్రాంతం కావడం వల్ల, ఇక్కడ వందల సంఖ్యలో లాడ్జీలు, రిసార్ట్​లు ఉన్నాయి. వాటికి కాపలాగా మేలు జాతి శునకాలూ ఉన్నాయి. సెప్టంబర్​ 29న ఓ చిరుత రిసార్ట్​ ముందు నిద్రిస్తున్న ఓ శునకాన్ని వేటాడేందుకు వచ్చింది, కానీ శునకం తప్పించుకుంది. రెండు వారాల వ్యవధిలోనే తిరిగి అదే ప్రాంతంలో మరో గుమ్మం ముందు విశ్రాంతి తీసుకుంటున్న ఓ శునకాన్ని 3 నిమిషాల పాటు మాటువేసి మరీ ఆహారంగా చేసుకుంది. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్​ అవుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details