
ఉత్తర భారతంలో 'జనతా కర్ఫ్యూ' విజయవంతం - హిమాచల్ ప్రదేశ్లో జనతా కర్ఫ్యూ
జనతా కర్ఫ్యూతో దేశ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, హరియాణా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బంగాల్ రాష్ట్రాల్లో పూర్తిగా బంద్ పాటించారు. ప్రజలు బయటకు రాకుండా కర్ఫ్యూకు తమ మద్దతు తెలిపారు. బంగాల్లో లోకల్ రైళ్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. యూపీలో పోలీసులు ప్రజలకు మాస్క్లు, శానిటైజర్లను అందిస్తున్నారు. బయటకు రావద్దని కోరుతున్నారు.