విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ట్రాఫిక్ జాం - కశ్మీర్లో రహదారిపై పడ్డ కొండచరియలు
జమ్ముకశ్మీర్ కతువాలో భారీవర్షాలు సంభవించాయి. వర్షాల ధాటికి పంతల్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. వాహనాలు గంటలకొద్దీ నిలిచిపోయాయి. సహాయక చర్యలను ముమ్మరం చేసినట్లు విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.