తెలంగాణ

telangana

పరిహారం కోసం 'సజీవ సమాధి'తో రైతుల నిరసన

By

Published : Nov 22, 2019, 12:02 PM IST

నష్టపోయిన పంటకు పరిహారం చెల్లించాలని గుజరాత్​ రైతులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. సజీవ సమాధి తరహాలో ఆందోళన వ్యక్తం చేశారు. శిరస్సు వరకు శరీరాన్ని భూమిలో పూడ్చుకుని ప్రభుత్వానికి తమ ఆవేదన తెలియజేశారు. వర్షం వల్ల పంట నష్టం జరిగిందని.. బీమా వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సంప్రదించినా ఫలితం లేదని చెప్పారు రాజ్​కోట్​ జిల్లా దోరాజీ తాలుకా రైతులు.

ABOUT THE AUTHOR

...view details