ఆ ఊరిపై ఒకేసారి 200 ఏనుగుల దండయాత్ర.. చివరకు... - అసోంలో ఏనుగుల గుంపు
Elephant Herd In Odisha: అసోంలోని నగావ్ జిల్లా సగున్బాహి గ్రామంలో ఏనుగుల గుంపు హల్చల్ చేసింది. ఒక్కటికాదు రెండు కాదు ఏకంగా 200 ఏనుగులు జనావాసాల్లోకి ప్రవేశించాయి. గజరాజులను చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. గ్రామస్థులు, అటవీశాఖ అధికారులు కలిసి.. ఏనుగుల గుంపును అడవిలోకి పంపే ప్రయత్నం చేశారు. ఆహారం కోసం వెతుక్కుంటూ గజరాజులు గ్రామంలోకి ప్రవేశించాయని నగావ్ అటవీ సంరక్షణాధికారి రాజేన్ సైకియా తెలిపారు.