తెలంగాణ

telangana

By

Published : Jan 24, 2020, 9:28 AM IST

Updated : Feb 18, 2020, 5:09 AM IST

ETV Bharat / videos

మౌనీ అమావాస్య రోజున వారణాసికి పోటెత్తిన భక్తులు

మౌనీ అమావాస్య సందర్భంగా పవిత్ర స్నానాల కోసం వారణాసిలోని గంగానదికి భక్తులు పోటెత్తారు. గంగాఘాట్‌ వద్ద పుణ్య స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు చేశారు. సంక్రాంతి పర్వదినం తరువాత వచ్చే పుష్యమాస అమావాస్యను మౌనీ అమావాస్య అంటారు. ఈ రోజున పితృతర్పణాలు, నదీ స్నానాలు, మౌన వ్రతం పాటించడం పుణ్యప్రదమన్నది శాస్త్రోక్తి. సాధువులు, యోగులు ఈ రోజున మౌనంగా ఉంటారు. జ్ఞానాన్ని నిద్రలేపే చర్యగా భావించి, మాటలు అవసరం లేదని యోగులు భావిస్తారు.
Last Updated : Feb 18, 2020, 5:09 AM IST

ABOUT THE AUTHOR

...view details