Lal Bahadur Shastri Jayanti: గోధుమలతో మాజీ ప్రధానికి నివాళి - ఎయిర్ రైఫిల్ షెల్స్తో లాల్ బహదుర్ శాస్త్రికి నివాళి
భారత మాజీ ప్రధాని, దివంగత లాల్ బహదూర్ శాస్త్రి (Lal Bahadur Shastri Jayanti) జయంతిని పురస్కరించుకుని చండీగఢ్కు చెందిన ఓ చిత్రకారుడు వినూత్న రీతిలో నివాళి అర్పించారు. గోధుమలు, ఎయిర్ రైఫిల్ షెల్స్ను ఉపయోగించి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాన్ని రూపొందించారు. లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన 'జై జవాన్ జై కిసాన్' నినాదం స్ఫూర్తితో...ఈ చిత్రంలో గోధుమలు రైతులకు, ఎయిర్ రైఫిల్ షెల్స్ జవాన్లకు ప్రాతినిధ్యం వహిస్తాయని చిత్రకారుడు తెలిపారు.