బైకర్పై ఏనుగు దాడి- త్రుటిలో తప్పిన ముప్పు - Elephant attacked on bikers news
ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు వ్యక్తులపై ఏనుగు దాడి చేయబోయింది. అయితే బైక్ వేగం పెంచి గజరాజుకు దొరక్కుండా పక్క నుంచి వెళ్లిపోవడం వల్ల త్రుటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో తలవాడి-సత్యమంగళ మార్గంలో జరిగింది. వెనుక సీటులో కూర్చున్న వ్యక్తి రికార్డు చేసిన ఈ దృశ్యాలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
Last Updated : Oct 27, 2020, 2:23 PM IST