అసోంలో వరదలకు 66 వన్యప్రాణులు బలి - Kaziranga National Park news
అసోం వరదల బీభత్సానికి ఇప్పటివరకు 66 వన్యప్రాణులు బలయ్యాయి. మరో 170 జీవుల్ని రక్షించినట్లు కాజీరంగా జాతీయ పార్కు అధికారులు తెలిపారు. కుండపోత వానలతో పార్కులో 80శాతం భూభాగాన్ని వరద ముంచెత్తింది. దీంతో అక్కడి మూగ జీవాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిపోతున్నాయి. జింకలు, ఏనుగులు, ఖడ్గమృగాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నాయి.