తీరానికి కొట్టుకొచ్చిన భారీ మృత తిమింగలం - రామంతపుపం బీచ్
తమిళనాడు రామనాథపురం జిల్లాలోని వలినొక్కమ్ సాగర తీరానికి ఓ భారీ తిమింగలం కొట్టుకువచ్చింది. చనిపోయిన తర్వాతే ఈ భారీ సముద్ర జీవి ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్లు అధికారులు భావిస్తున్నారు. దాదాపు 7 టన్నుల వరకు బరువు ఉండవచ్చని చెప్పారు. మృత తిమింగలాన్ని చూసేందుకు సమీపంలోని గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.